అదానీ పేరుతో దేశాన్ని దోచుకుంటున్నది మోడీనే!

It is Modi who is robbing the country in the name of Adani!అధ్యక్ష మహోదయా! నేను ఈ మధ్య ఒక బీజేపీ అగ్రనేతతో మాట్లాడడం జరిగింది. మా మధ్య చాలాసేపు సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఆ వివరాలు తెలుసుకుంటే ఇప్పుడు మీకూ, సభలోని వారందరికీ రోమాలు నిక్కబొడు స్తాయి. కండ్లు భైర్లు కమ్ముతాయి… ఆయన నన్ను ఒక ప్రశ్న అడిగాడు- ”కేజ్రీవాల్‌ జీ మీకు ఏమనిపిస్తోంది? మోడీజీ అదానీకి ఎందుకిం తగా మేలు చేస్తున్నాడూ?” -అని|| నేనన్నాను- ”వాళ్లిద్దరు మంచి మిత్రులు కదా? అందుకని మిత్రునికి సహాయ పడుతున్నాడు”- అని చెప్పాను.
”ఒస్‌! అంతే అనుకుంటు న్నారా?”- అని ఆయన చిన్నగా నవ్వుకుంటూ ఇంకా ఇలా అన్నాడు- ”మోడీజీ ఇంతవరకు ఎవరికీ ఏమీ చేయలేదు. తన భార్యకు ఏమీ చేయలేదు. స్వంత తల్లిని ఆదుకో లేదు. గుజరాత్‌లో ఉండే సోదరుడికి, ఇంకా ఇతర కుటుంబ సభ్యులకు, బంధువర్గానికీ ఎవరికీ ఏమీ చేయలేదు. అంతేకాదు ఆయనకు రాజకీయ భిక్ష పెట్టిన రాజకీయ గురువుకే ఏమీ చేయలేదు. అలాంట ప్పుడు ఒక స్నేహితుడి కోసం నియమ నిబంధనలన్నీ పక్కకునెట్టి ఇంత పెద్ద మొత్తంలో సహాయం మీద సహాయం మళ్లీ మళ్లీ ఎందుకు చేస్తున్నాడూ? – అని ఎప్పుడైనా ఆలోచిం చారా? ఆలోచించి చూడండి”- అంటూ కొద్దిసేపు ఆగాడు. ”స్వంత వాళ్ళను కూడా అశ్రద్ధ చేసి ఎవరి స్వార్థం వాళ్లు చూసుకునే ఈ రోజుల్లో ఎవరైనా ఒక స్నేహితుడి కోసం దేశాన్ని తాకట్టు పెట్టే పరిస్థితి తీసుకొస్తాడా? అని ఆయన నన్ను మళ్లీ ప్రశ్నించాడు.
”అయితే మరి విషయ మేమిటో మీరే చెప్పండి”- అని అడిగాను నాకేమీ అర్థం కాక… ఆయన చెప్పడం కొనసాగించాడు.
”కొంచెం సీరియస్‌గా ఆలోచించండి. మీకే అర్థమవుతుంది! హిడిన్‌ బర్గ్‌ రిపోర్టు వచ్చింది. నాలుగు వైపులా ఛీత్కారాలు వినిపించాయి. అదానీ గ్రూపు కుప్పగూలింది. ఇది అందరికీ తెలిసిన విషయమే! మోడీజీ ఎంతటి స్వార్థ జీవి అంటే వారి మధ్య కేవలం స్నేహ బంధమే ఉంటే- ఒక్క నిమిషంలో నాకు అతనితో అంటే అదానీతో అవసరమే లేదని చెప్పి, పక్కన పెట్టేవాడు- కానీ అలా జరగలేదు. కారణం ఏమిటీ? ఇప్పటికీ ఆయనకు వెన్నుదన్నుగా ఉంటున్నాడు. ఒక్కోసారి ఆదానీకి డబ్బులివ్వండని ఎస్‌బీఐతోి చెపుతున్నాడు. ఈ రోజే పత్రికల్లో వార్త వచ్చింది. పీఎఫ్‌ వారికి కూడా డబ్బులివ్వమని చెప్పాడట. అంటే ఆదానీకి డబ్బులిచ్చి కాపాడండని మొత్తం ఏజెన్సీలన్నింటినీ పుర మాయి స్తున్నాడు. ఎందుకూ? ఏ రాజకీయ నాయకుడూ అలా చేయడు. తనకు అప్రతిష్ట వస్తుందనుకున్న మరు క్షణమే అలాంటి వారిని దూరం పెడతారు. ఎవడో మునిగిపోతున్నాడంటే ఏ రాజకీయ నాయకుడైనా ఎందుకు పనిగట్టుకుని అన్ని వైపుల నుండి అన్నిరకాలుగా సహాయపడతాడూ? కొద్దిపాటి ఇంగిత జ్ఞానం ఉన్నవారికైనా విషయం అర్థమవు తుంది-” అని అన్నాడు ఆ బీజేపీ ముఖ్యనేత.
అవును-అందులో ఇంకా ఏదో విషయం దాగుందని నాకు అనిపించింది. అందుకే నేనన్నాను. ”నిజమే కదా? మరి మోడీజీ ఎందు కు అలా చేస్తున్నాడో నాకైతే అర్థం కావడంలేదు. ఘోరంగానష్టపోయి, కూలిపోయేవారికి ఏ రాజకీయ నాయకుడైనా ఎందుకు సహాయ పడ తాడూ? అసలు విషయ మేమిటో చెప్పండి!”- అని అడిగాను కొంచెం ఉత్సుకతతో.
”అసలు విషయమేమంటే-బయటికి చూపించేది అదానీని… లోపల ఉన్నది మోడీజీనే” అన్నాడు. ”అరె! అదెలా?” నా ఉత్సుకత పెరిగింది.
”బయటి ప్రపంచానికి అదానీని చూపిస్తున్నాడు గానీ, లోపల ఆ డబ్బులన్నీ మోడీవే. మోడీ నుండి 10/15/20 శాతం కమీషన్‌ తీసుకుని పనిచేసే ఫైనాన్సియల్‌ మేనేజర్‌-అదానీ! అంతే- ప్రపంచ ఐశ్వర్య వంతుల జాబితాలో అదానీపేరు రెండోదిగా ప్రకటించినపుడు – మనం అర్థం చేసు కోవాల్సిందేమంటే ప్రపం చంలోని అత్యంత ధనవం తుల్లో మోడీ రెండవవాడిగా నిలిచాడు- అని! రేప్పొద్దున అధికారం కోల్పోయి JPC\ ED \CBI లతో విచారణ జరిగితే గనక, దొరికిపోయేది అదానీ కాదు – మోడీనే! నిండా మునిగేది అదానీకాదు, మోడీనే! అదానీ దివాలా తీశాడంటే మోడీజీ దివాలా తీశాడనే అర్థం!!
ఆయన చెపుతున్న మాటలకు నేనాశ్చర్య పోయాను. నాకు నమ్మశక్యంగా అనిపించలేదు. అందుకే అన్నాను. ”మోడీజీకి అంతడబ్భు ఎందుకూ? కుటుంబమే లేనోడు. అంత డబ్బు ఏం చేసుకుంటాడు పాపం!!”
”పాపం కాదు, కేజ్రీవాల్‌జీ అది దాహం! ధన దాహం!! అదొక పిచ్చి, అదొక మైకం.. దానికి హద్దే ఉండదు. దానికి అలవాటు పడిన వాడు వెనక్కి తగ్గడు. విచక్షణా శక్తి కోల్పో తాడు. ప్రపంచంలోని ధనవంతులంతా ధన సంపాదన లో ఇంకా ఇంకా ఎందుకు తాపత్రయపడు తున్నారూ? సామాజిక సేవా కార్యక్రమాలు ఎందుకు చేపట్టడం లేదూ? ఒక్కసారి ఆలోచించండి. ధన దాహం నెత్తికెక్కినవాడు ఒక పిచ్చివాడిలా ప్రవర్తిస్తాడు. ఎన్ని అనైతిక కార్యక్రమాలకైనా సిద్ధపడతాడు. ఏది ఏమైనా కానీయండి. వ్యక్తి గతంగా తన స్వార్థం తను చూసుకుంటాడు.”- అని ఆ బీజేపీ అగ్ర నాయకుడు చెప్పినపుడు నాకొక కొత్త విషయం తెలిసినట్లయ్యింది-నమ్మక తప్పలేదు. ఆయన చెప్పిన కోణంలో ఆలోచిస్తే నిజమే! మోడీజీ ఈ పదేండ్లలో అలాంటి అనైతిక కార్య్నకమాలకే ప్రాధాన్యమిచ్చాడని అనిపించింది. అయితే, మోడీ ప్రపంచ ధనవంతుల్లో అక్రమంగా మొదటివాడిగా నిలవాలని తాపత్రయ పడుతున్నాడా? – హమ్మా!!
నా పరిస్థితి గమనించి ఆ బీజేపీ అగ్రనేత మరికొంత వివరంగా చెప్పసాగాడు. గుడ్లప్ప గించి వినడం నావంతయింది. అధ్యక్ష మహోదయా! ఆయన ఇలా చెప్పాడు- ”కేజ్రీవాల్‌ జీ! ఆ మధ్య మోడీజీ శ్రీలంకకు వెళ్లారు. మీకు గుర్తుంది కదా? శ్రీలంక రాష్ట్రపతి రాజపక్స, రాజపక్సను కలిసి అక్కడి విండ్‌ ప్రాజెక్ట్‌ను బలవంతంగా అదానీ గ్రుపునకు ఇప్పంచి వచ్చాడు. ఆ స్థాయి నేతలు ఎవరైనా అంతగా దిగజారి మీ ప్రాజెక్ట్‌ నేను చెప్పినవారికే ఇవ్వండని ప్రాధేయపడరు. కానీ, నైతికతను, స్థాయిని, హోదాను మరిచిన మోడీ దేశ ఔన్నత్యాన్ని కూడా లెక్కచేయకుండా రాజపక్స దగ్గర దేబరించి, విండ్‌ ప్రాజెక్ట్‌ అదానీకి ఇప్పించి వచ్చాడు. అంటే ఏమిటీ లోపాయకారిగా ఆ ప్రాజెక్ట్‌ తనే తీసుకున్నాడు. ఈ విషయం ఎలా బయటికి వచ్చిందీ అంటే- శ్రీలంక పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీ, అక్కడి విద్యుత్‌ బోర్డు ఛైర్మన్‌ను విచారిస్తున్నప్పుడు అసలు విషయం బయటపడింది. మోడీ బలవంతం మీద రాజపక్స చెపితేనే తను ఆ ప్రాజెక్ట్‌ అదానీ గ్రూపుపకు ఇవ్వాల్సి వచ్చిందని ఆయన అన్నాడు. ఇక బంగ్లాదేశ్‌ వారికి విద్యుత్‌ కావల్సి వచ్చింది-1500 మెగావాట్‌ విద్యుత్తు 25 ఏండ్ల కొరకు! మోడీజీ ఆ ప్రాజెక్ట్‌ కూడా అదానీకే ఇప్పించాడు. అంటే తన ఖాతాలో వేసుకున్నా డని అర్థం! మోడీజీ ఇజ్రాయిల్‌ వెళ్లాడు. ఇజ్రాయిల్‌తో మన దేశానికి రక్షణ సంబంధమైన కొనుగోళ్లు ఉన్నాయి. ఆ వ్యాపారమంతా మోడీ అదానీకి ఇప్పించాడు. అంటే తనకే ఇప్పించు కున్నాడు. రెండు మూడేండ్ల క్రితం దేశంలోని ఆరు విమానాశ్రయాల్ని ప్రయివేటు పరం చేయడానికి వేలం వేశారు. అందులో ఉన్న ముఖ్య, నిబంధన ఏమిటంటే-‘ఎయిర్‌ పోర్ట్‌ నిర్వహణలో అనుభవమున్నవారే వేలం పాటలో పాల్గొనాలి!’ అని ఉంది. అయితే చివరి క్షణంలో ఆ నిబంధన తొలగించి, ఎయిర్‌ పోర్ట్‌ నిర్వహణలో ఏ మాత్రం సంబంధం లేని అదానీకి వాటిని అప్ప గించారు. అంటే ఏమిటీ? ఎయిర్‌పోర్ట్‌ నిర్వహణ ఏ మాత్రం తెలియని మోడీ వాటిని తీసుకున్నాడు. ఏ ప్రభుత్వమైనా ఆయా శాఖల్లో అనుభవమున్న వారినే ఎన్నిక చేసుకుంటుంది కదా? కానీ, మోడీ ప్రభుత్వంలో అధికారం ఇలా దుర్వినియోగ మయ్యింది.”
కొంచెం ఊపిరి తీసుకుని, ఆ అగ్రనేత మళ్లీ ప్రారంభించాడు. నా చెవులను నేను నమ్మలేకుండా వింటూ కూర్చున్నాను. ”కేజ్రీవాల్‌జీ మీకు తెలుసా? నవంబర్‌ 2021 నుంచి దేశంలోని విమానాశ్రయాలలో జరిగే వ్యాపార లావాదేవీలలో 30 శాతం డబ్బు ఎవరికి పోతోందీ? అంటే-అదానీ పేరుతో మోడీ జేబులోకి పోతోంది. ED\CBI వంటి తుపాకులు గురిపెట్టి, బెదిరించి ఫ్యాక్టరీలు లాక్కుంటున్నది. ఎవరి కోసమో కాదు, మోడీ తన స్వంతానికే’ 10 అక్టోబర్‌ 2018న క్రిష్ణపట్నం ఎయిర్‌పోర్ట్‌ మీద ఇన్‌ కంటాక్స్‌ సోదాలు నిర్వహించి – అదానీ పేరు చెప్పి దాన్ని మోడీ స్వంతం చేసుకున్నాడు. 10 డిసెంబరు 2020 ఎసిసి, అంబుజా సిమెంట్‌ ప్లాంట్స్‌ మీద ED\CBI/IT సోదాలు నిర్వహించి క్రమంగా వాటిని అదానీ పేరుతో మోడీ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇకపోతే ముంబై విమానాశ్రయం -20 జులై 2020న దాని యజమాని జివికె మీద సోదాలు నిర్వహిం చారు. ఒక్కటే బెదిరింపు- ”ఇచ్చేసి వెళ్లు -లేదా జైలుకెళ్లి కూచో-”అని! అలా కంపనీలు, ఫ్యాక్టరీలు, విమానాశ్రయాలు- అన్నింటికీ అదే దౌర్జన్యం! తలకు తుపాకి గురిపెట్టి ‘ఇస్తావా’ ఛస్తావా?’ అన్న విధంగా మోడీ దౌర్జన్యం నిరాఘాటంగా సాగుతూ వస్తోంది”.
”కేజ్రీవాల్‌ జీ! అర్థమవుతోంది కదా? ఇంకా చెప్పండి-మోడీ అవినీతికి కొత్తదారులు ఎలా వేశాడో- రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం ఒక చిత్రమైన ఆదేశం జారీ చేసింది. ప్రతి రాష్ట్రం తమ పవర్‌ప్లాంట్‌కు అవసరమ య్యే పదిశాతం ఇంపోర్టెడ్‌ కోల్‌ (విదేశ బొగ్గు) అదానీ నుంచి కొనుగోలు చేయాలని ఆ ఆర్డరు సారాంశం! అవసరం ఉన్నా లేకున్నా తప్పక కొనాలని ఆదేశించింది.
దేశంలో దొరికే బొగ్గు టన్నుకు రూ.2 వేలయితే, విదేశాల బొగ్గు రూ.20 వేలు. అంటే పదిరెట్లు ఎక్కువ ధర పెట్టి తప్పనిసరిగా మోడీ (అదానీ)బొగ్గు కొనాల్సి ఉంటుంది. ఈయన దేశానికి ప్రధానా? నియంతా? దౌర్జన్య వ్యాపారా? దేశాన్ని ఇంతగా వంచించే నేత మనకు అవసరమా? బొగ్గు విలువలు ఏ ప్రయివేటు కంపెనీ దగ్గర ఉండకూడదనీ, కేవలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలోనే ఉండాలని లోగడ సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. దానికి విరుగుడు మోడీ కనుక్కున్నాడు. 4వేల కేలరీల కన్నా తక్కువ ఉన్న బొగ్గు రిజెక్టెడ్‌ (నాణ్యత లేని)ది అని – అదానీకి ఉచితంగా అప్పగించాడు. అంటే తనకే పంపించు కున్నాడు. అసలైతే అదంతా నాణ్యత గల బొగ్గు అధికార దుర్వినియోగంతో ‘రిజెక్ట్‌డ్‌’ అని చెప్పి, ఉచితంగా కాజేయడమన్న మాట! ఆ రకంగా ఈ దేశ ఖజానా నుంచి రూ.2800 కోట్లు మోడీ లాగేస్తున్నాడు. 2014లో అదానీ (మోడీ) ఆదాయం రూ.50 వేల కోట్లయితే, ఏడేండ్ల తర్వాత అది 11.5 లక్షల కోట్లు అయ్యింది.”
”మోడీజీకి చదువు లేదు. ఇంగ్లీషు రాదు, ఆర్థిక పరిజ్ఞానం లేదు. ప్రపంచ పరిజ్ఞానం శూన్యం అందుకే అదానీని సలహాదారుగా చేసు కుని, అతనికి కొంత కమీషనిస్తూ తన అధికా రాన్ని దుర్వినియో గం చేస్తూ. దేశాన్ని దోచుకుం టున్నాడు.- ఇంతటి అవినీతి ప్రధాని మనకు గతంలో ఎవరూ లేరు. విదేశాల నాయకులొస్తే వారితో ఫొటోలు తీయించుకోవడం సరే-కానీ, దేశాన్ని తాకట్టుపెట్టే ప్రయాదకరమైన ఒడం బడికల మీద ఎక్కడెక్కడ సంతకాలు చేస్తున్నా డో ఏమో? దేశ ప్రజలు నిజాలు గ్రహించి, మోడీ-బీజేపీల నుంచి అధికారం తక్షణమే లాగేసుకోవాలి! తప్పదు!! దేశాన్ని కాపాడు కోవాలి!!!” అంటూ కేజ్రీవాల్‌ ముగించాడు.
– కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు విజేత, జీవశాస్త్రవేత్త (మెల్బోర్న్‌ నుంచి)
డాక్టర్‌ దేవరాజు మహారాజు

Spread the love