నేడు నాగర్‌ కర్నూల్​లో కేసీఆర్ ప‌ర్య‌ట‌న

నవతెలంగాణ-హైదరాబాద్ : ఇవాళ‌ నాగర్‌కర్నూల్‌లో మాజీ సీఎం కేసీఆర్ చేప‌ట్టిన బ‌స్సు యాత్ర కొన‌సాగనుంది. అక్క‌డ జరిగే రోడ్‌షోలో కేసీఆర్ పాల్గొననున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గెలుపు కోసం ప్రసంగించనున్నారు. బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌లో జరిగే పార్టీ ఆవిర్భావ వేడుకల్లో కేసీఆర్ పాల్గొనే అవకాశం ఉంది. మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ నియోజకవర్గాల్లో భారసాల అభ్యర్థులు మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌లు తమ గెలుపునకు దిశానిర్దేశం చేయనున్నారు. సాయంత్రం 6 గంటలకు నాగర్ కర్నూల్ లోని ఉయ్యాలవాడ నుంచి బస్టాండ్ వరకు రోడ్ షో కొనసాగనుంది. అక్కడ కార్నర్ మీటింగ్ లో కేసీఆర్ పాల్గొంటారు. దీంతో జిల్లాలో కేసీఆర్ రెండు రోజుల బస్సు యాత్ర ముగుస్తుంది.

Spread the love