మోడీ హయాంలో అదానీ, అంబానీ సంపద పెరిగింది: కోదండరాం

Professor Kodandaramనవతెలంగాణ-హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో ప్రజల సంపద ఏమో కానీ… అదానీ, అంబానీ సంపద మాత్రం పెరిగిందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. మంగళవారం నాగర్ కర్నూలులోని బిజినేపల్లిలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ గెలిచాకే తెలంగాణలో ప్రజాపాలన వచ్చిందన్నారు. బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒక్కటేనని విమర్శించారు.

Spread the love