వైద్య ఖర్చులకు కేఎస్‌ఆర్‌ ఆర్థిక సాయం

నవతెలంగాణ-దోమ
మండల పరిధిలోని మోత్కూర్‌ గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన మహమ్మద్‌ ఖాజామియా మూడు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో చెయ్యి విరిగి, గాయాలతో బాధపడుతూ హైదరాబాద్‌ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడి అతని ఆరోగ్య స్థితిగతులను తెలుసుకొని అతని వైద్య ఖర్చుల కోసం భార్య బిస్మిల్లాకి ఆర్థిక సాయం అందించి కేఎస్‌ఆర్‌ ట్రస్ట్‌ చైర్మెన్‌ శరత్‌ కుమార్‌ రెడ్డి భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో చాపల గూడెం లక్ష్మణ్‌, లింగయ్య, శివ,శ్రీకాంత్‌, మహేందర్‌, రాములు,కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అనంతరం దోమ మండల పరిధిలోని మోత్కూర్‌ గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన లిమంగలి పద్మమ్మ కొన్ని రోజుల క్రితం రెండు కండ్లు ఆపరేషన్‌ చేసుకున్నారు. కానీ అందులో ఒక కన్ను పూర్తిగా కోల్పోయింది. రెండో కన్ను నయం కాక చూపు లేక ఆమె తలకు బలమైన గాయం తగిలింది. అదేవిధంగా ఆమె కిడ్నీ కూడా బాగలేదన్న విషయం తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆమె ఆరోగ్య స్థితిగతులను తెలుసుకొని ఆమె వైద్య ఖర్చుల కోసం కుమారుడు శ్రీకాంత్‌కు ఆర్థిక సాయం అందజేసి భరోసా కల్పించారు. కార్యక్రమంలో చాపల గూడెం లక్ష్మణ్‌, లింగయ్య, శివ, శ్రీకాంత్‌, మహేందర్‌, రాములు, శ్రీశైలం, భానుచందర్‌, శివ, టి. శివ, కృష్ణ, కార్తీక్‌, వి.శివ, అరుణ్‌, బి.కార్తీక్‌ కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love