పోలీస్ స్టేషన్ పై, కానిస్టేబుల్ పై దాడి చేసిన వ్యక్తి రిమాండ్

 నవతెలంగాణ – రామారెడ్డి
రామారెడ్డి పోలీస్ స్టేషన్ పై, పోలీస్ కానిస్టేబుల్ పై గురువారం కత్తితో దాడి చేసి, పోలీస్ స్టేషన్ అద్దాలు పగలగొట్టిన వ్యక్తిపై కేసు నమోదు చేసి రిమాండ్ పంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన బిట్ల రవి గురువారం అర్ధరాత్రి 1: 24 నిమిషాలకు తల్లిదండ్రులతో గొడవ పడడంతో, తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కు రావడంతో, డ్యూటీలో  ఉన్న కానిస్టేబుల్ సిద్ధిరాములు తల్లిదండ్రులతో మాట్లాడుతుండగా, రవి పోలీస్ స్టేషన్కు కత్తితో  వచ్చి, తల్లిదండ్రులు ఇంటికి వెళ్ళిపోగానే, పోలీస్ స్టేషన్ తలుపులు పగలగొట్టి, సిద్ధి రాములు పై కత్తితో దాడి చేసి, చంపడానికి ప్రయత్నించగా, ఏఎస్ఐ రవీందర్, కానిస్టేబుల్ గణేష్ అడ్డుకొనగా, బూతులు తిడుతూ, చేతులతో కొట్టాడని ఎస్సై విజయ్ కేసు నమోదు చేయగా, సిఐ రామన్ బిట్ల రవిని జ్యుడీషియల్ రిమాండ్కు పంపినట్లు ఎస్సై విజయ్ తెలిపారు.
Spread the love