నిజామాబాద్ కి చెందిన దంపతులు కర్ణాటక లాడ్జిలో ఉరివేసుకొని ఆత్మహత్య

నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ నగరానికి చెందిన దంపతులు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం తెలిసింది. వీరు కర్ణాటక రాష్ట్రంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ మేరకు నిజామాబాద్ పోలీసులకు కర్ణాటక పోలీసులు ప్రాథమిక సమాచారం అందించారు అని తెలిసింది. వెంటనే అప్రమత్తమైన నాల్గవ పోలీస్ స్టేషన్ అధికారులు విచారణ చేపట్టిన అనంతరం మృతులు గాయత్రీ నగర్ ప్రాంతానికి చెందిన మేడవరపు రాజు(55), మేడవరపు స్వాతి(53)గా పోలీసులు గుర్తించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కర్ణాటక రాష్ట్రంలోని కొడగు జిల్లా సోమవార్ పేట్ పరిధిలోని లాడ్జిలో సూసైడ్ చేసుకున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది అయితే ఈ ఘటనపై కర్ణాటక పోలీస్ అధికారులు కేసును ప్రస్తుతం నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిజామాబాద్ పోలీస్ అధికారులు ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది అయితే ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు. అనేది ఇంకా వివరాలు తెలియ రాలేదు.
Spread the love