బాధిత కుటుంబానికి పరామర్శ 

నవతెలంగాణ యాదగిరిగుట్ట రూరల్
యాదగిరిగుట్ట మండలం దాతర్ పల్లి గొల్లగుడిసెలు గురువారం, చుక్కల భారతమ్మ  గుండెపోటుతో మృతి చెందగా ఆ సమయంలో రోధిస్తున్న తన కోడలు మంగమ్మ కూడా మృతి చెందగా తీవ్ర విషాదం నెలకొన్న ఆ కుటుంబాన్ని, మంగమ్మ పిల్లలను ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పరామర్శించారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చీర శ్రీశైలం, కౌన్సిలర్ ముకెర్ల మల్లేష్ యాదవ్, పన్నీరు భరత్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love