గోవింద్ పెట్ పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాసం

నవతెలంగాణ – ఆర్మూర్
మండలం లోని గోవిందపేట్ ప్రాథమిక పాఠశాల యందు బుధవారం సామూహిక అక్షరాబ్యాసం నిర్వహించారు. దశాబ్ది ఉత్సవాలలో భాగంగా స్థానిక ప్రజాప్రతినిధులు పిల్లలకు అక్షరాలు దిద్దించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బండమిది జమున గంగాధర్, ఎంపీటీసీ యల్లా రాజకుమార్, సొసైటీ చైర్మెన్ బంటు మహిపాల్, వీడీసీ అధ్యక్షులు లింగారెడ్డి, ఎస్ఎంసి చైర్మెన్ అంజాద్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
సన్మానం..
ఉత్తమ సేవాలాందించినదుకుగాను ఉత్తమ మహిళా ఉపాధ్యాయు రాలిగా ప్రశంసపత్రం పొందిన గోవిందపేట్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మాడవేడి పద్మావతి ను సన్మానించారు.

Spread the love