కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు..

నవతెలంగాణ -భిక్కనూర్
మండలంలోని భాగిర్తిపల్లి గ్రామంలో గురువారం వివిధ పార్టీలకు చెందిన నాయకులు మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలాగే భిక్కనూర్ పట్టణానికి చెందిన సంఘం సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి షబ్బీర్ అలీ పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు మద్ది చంద్రకాంత్ రెడ్డి, భిక్నూర్‌ మండల అధ్యక్షుడు భీమ్ రెడ్డి, కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు లింగారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుదర్శన్, పట్టణ అధ్యక్షుడు దయాకర్ రెడ్డి, యువజన కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు సందీప్, జిల్లా నాయకులు లింబద్రి, సిద్ధ గౌడ్, రవి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
Spread the love