కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు..

నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన సుమారు 150 మంది, జంగంపల్లి గ్రామానికి చెందిన యాదవ సంఘం సభ్యులు మాజీ మంత్రి, మహమ్మద్ షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కెసిఆర్ అరాచకపాలను తరిమి కొట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, రానున్న రోజుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో టి పి సి సి రాష్ట్ర కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు చంద్రకాంత్ రెడ్డి, మండల అధ్యక్షులు భీమ్ రెడ్డి, పెద్ద మల్లారెడ్డి గ్రామ అధ్యక్షుడు స్వామి, ఎన్ఆర్ఐ సెల్ జిల్లా కన్వీనర్ సుధాకర్ రెడ్డి, కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు లింగారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుదర్శన్, సీనియర్ నాయకులు బాగారెడ్డి, సురేందర్ రెడ్డి, నర్సింలు, ఈశ్వర్ రెడ్డి, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love