హుస్నాబాద్ అర్టీసీ డిపోలో మెగా రక్తదాన శిబిరం..

నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ ఆర్టీసీ డిపోలో మంగళవారం డిపో మేనేజర్ సిహెచ్ వెంకటేశ్వర్లు మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డిఎం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆదేశాల మేరకు హుస్నాబాద్ డిపోలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రక్తదాన శిబిరం లో 53 మంది రక్తదానం చేశారన్నారు. రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్లు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సూపెరండెంట్, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love