బాధిత కుటుంబాలను పరామర్శించిన మంత్రి సీతక్క

నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలం లోని కోటగడ్డ గ్రామానికి చెందిన కమ్యునిస్ట్ నాయకుడు తుమ్మల భిక్షం రెడ్డి  మరణించగా గురువారం మంత్రి సీతక్క వారి కుటుంబాన్ని పరామర్శించారు. ముందుగా బిక్షం రెడ్డి చిత్ర పటానికి పూలతో నివాళులర్పించారు.ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ తుమ్మల భిక్షం రెడ్డి  అకాల మరణం కమ్యునిస్ట్ ఉద్యమానికి తీరని లోటని ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు. ఇదే గ్రామానికి చెందిన ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి సుధాకర్ తండ్రి అనారోగ్యం తో భాద పడుతుండగా వారిని పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితులు కుటుంబ సభ్యుల ను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్,మండల అధ్యక్షులు పాలడుగు వెంకట కృష్ణ తో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్, మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
Spread the love