భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

నవతెలంగాణ – హైదరాబాద్: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. వరుసగా రెండో రోజు లాభాలను మూటకట్టుకున్నాయి. అంతర్జాతీయ సానుకూలతలతో పాటు… బ్యాంకింగ్, ఐటీ రంగ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో మార్కెట్లు లాభాల్లో దూసుకుపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 655 పాయింట్లు లాభపడి 73,651కి ఎగబాకింది. నిఫ్టీ 203 పాయింట్లు పుంజుకుని 22,326 వద్ద స్థిరపడింది. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.40గా ఉంది.

Spread the love