మార్చి 31 నాటికి 100% పన్నులు వసూలు చేయాలి: ఎల్లారెడ్డి డిఎల్పివో సురేందర్

నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్

మార్చి 31 కెల్లా గ్రామాల్లోపల 100% పనులు వసూలు చేయాలని ఎల్లారెడ్డి డిఎల్పివో అన్నారు.  గురువారం మండల కేంద్రంలో గల మండల పరిషత్ కార్యాలయంలో ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులతో ఆయన సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక సంవత్సరం మార్చి 31న ముగియను ఉండటంతో మార్చ్ 31 వరకు 100% పన్నులు వసూలు చేయాలని ఆయన అన్నారు.  గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. గ్రామాలలో వాటర్ ట్యాంక్ లో క్లోరినేషన్ మురికి కాలువల పరిశుభ్రత తదితర అంశాలపై పంచాయతీలకు పలు సూచనలు సలహాలు చేశారు.  ఆయన వెంట ఎంపీడీవో పర్బన్న. ఎంపీవో శ్రీనివాస్ ఉన్నారు.
Spread the love