4.2 తీవ్రతతో ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం

నవతెలంగాణ – కాబూల్‌ : ఆఫ్ఘనిస్తాన్‌లో గురువారం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 4.2గా నమోదైందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ (ఎన్‌సిఎస్‌) సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేసింది. ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. గురువారం ఉదయం 5.44 గంటల సమయంలో ఈ భూకంపం సంభవించింది. వెడల్పు 36.36, వెడల్పు 71.18, లోతు 124 కి.మీ మేర ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం సంభవించింది. ఇంకా ఈ ఘటనకు సంబంధించి ఆస్తి, ప్రాణ నష్టాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Spread the love