టీవీ టెక్నీషియన్ యూనియన్ నూతన భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

నవతెలంగాణ- కంటేశ్వర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గాయత్రి నగర్ లో ఇందూర్ టీవీ టెక్నీషియన్ యూనియన్ నూతన భవనాన్ని ఆదివారం అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ..ఇందూరు టీవీ టెక్నీషియన్ నూతన భవనం నిర్మించుకోవడం అభినందనీయమని అన్నారు. 2018లో మీ సమావేశానికి వచ్చినపుడు స్థల సేకరణ చేస్తే నిధులు ఇస్తానని మాటిచ్చాను అని తెలియజేశారు. ఇచ్చిన మాట ప్రకారమే నా యొక్క ఎమ్మెల్యే కోట సీడీపీ నిధులనుండి 7.20 నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలియజేశారు. ఆ నిధులతో బ్రహ్మాండంగా భవనం నిర్మించుకున్న టీవీ టెక్నికల్ యూనియన్ సభ్యులకు అభినందనలు తెలిపారు. యూనియన్ సమస్యలు పరిష్కరించుకోవడానికి, సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి అనువైన స్థలంగా ఈ భవనం ఉపయోగపడుతుంది. నిజామాబాద్ నగరం లో అన్ని కులాల వారికి మతాల వారికి యూనియన్ల వారికి సమంగా నిధులు మంజూరు చేస్తున్నాను.ఇందుర్ టివి యూనియన్ సభ్యులకి ఏళ్ల వేళలా నా సాహకారం అందిస్తానని మాటిస్తున్నాను అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతు కిరణ్ , ప్రభాకర్ రెడ్డి , టిఆర్ఎస్ నగర అధ్యక్ష కార్యదర్శులు సిర్ప రాజు ,యెనుగందుల మురళి, టీవీ యూనియన్ సభ్యులు,భూస రవి,వొల్కొజి ప్రశాంత్, భూమేశ్వర్, కస్తూరి గంగరాజు బి ఆర్ ఎస్ నాయకులు, కార్పొరేటర్ లు పాల్గొన్నారు.

Spread the love