కలిగొట్ లో జాతీయ క్రీడా దినోత్సవం

ధాన్య చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్న ఉపాధ్యాయులు
ధాన్య చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్న ఉపాధ్యాయులు
నవతెలంగాణ- జక్రాన్ పల్లి 
మండలంలోని కలిగోట్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కలిగోట్ మంగళవారం జాతీయ క్రీడా దినోత్సవాన్ని శ్రీ ధ్యాన్చంద్ స్ఫూర్తిగా ఘనంగా నిర్వహించినట్లు సైన్సు టీచర్ సదాశివ్ తెలిపారు. ఇట్టి కార్యక్రమానికి ప్రధానోపాధ్యాయులు ఆత్మరామ్ ఎస్ఎంసి చైర్మన్ సత్యనారాయణ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ధాన్య చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఆటపాటలతో పిల్లలతో ఘనంగా నిర్వహించి బహుమతి ప్రధానోత్సవం గావించినారు.  కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయుడు జి యాదగిరిని సన్మానించారు. సైన్స్ టీచర్ సదాసివ్, కాషా గౌడ్, గోపి, ఆనంద్, శ్రీహరి  సరిత మేడం  ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
Spread the love