ఉపాధ్యాయుల జిపిఎఫ్ బిల్లులను వెంటనే చెల్లించండి..

– వెనిగళ్ళ సురేష్
నవతెలంగాణ- కంటేశ్వర్
టిపిటిఎఫ్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు శనివారం నిజాంబాద్ జిల్లా పరిషత్ కార్యాలయం ఎదుట పెండింగ్లో ఉన్న జిపిఎఫ్ బిల్లులను, మెడికల్ బిల్లులను, సిపిఎస్ జమలను పూర్తి చేయాలని నిరసన ప్రదర్శన చేశారు. ఆరు నెలలుగా జిపిఎఫ్ పెండింగ్ బిల్లులను మంజూరు చేయడం లేదు. ఉపాధ్యాయుల అడ్వాన్స్ లను మంజూరు చేయడం లేదు. సిపిఎస్ జమలను ఉపాధ్యాయులు ఖాతాలో జమ చేయడం లేదు. ఉపాధ్యాయులకు రావాల్సిన ఏరియర్షను వాయిదాల పద్ధతిలో దీర్ఘకాలంగా చెల్లించడం లేదు. కోట్లాది రూపాయలు బకాయిల పేరుతో చెల్లించకపోవడం, ఉద్యోగులకు అత్యవసరమైన సందర్భంలో పార్ట్ ఫైనల్ మంజూరు చేయకపోవడం అత్యంత శోచనీయం. వెంటనే అన్ని రకాల బిల్లులనుచెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ నిరసన కార్యక్రమంలో టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు వెనిగళ్ళ సురేష్, ఉపాధ్యక్షులు అరవింద్, కార్యదర్శులు మల్లేశం, మండల బాధ్యులు గోపి, సురేష్, గంగాధర్, లింబయ్య, రాజయ్య, రాజేశ్వర్, వజీర్ ముద్దుకృష్ణ, రాజేశ్వర్, ముత్తన్న, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Spread the love