బీఎస్పీ కార్యాలయంలో గడపగడపకు కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణ

నవతెలంగాణ- కంటేశ్వర్
నిజామాబాద్ నగరంలోని సరస్వతి నగర్ బహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయంలో అర్బన్ ఇంచార్జ్ నీరడి లక్ష్మణ్ శనివారం విలేకరుల సమావేశం నిర్వహించి వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. మాట్లాడుతూ బీసీ,ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు అనివర్గ పేదల కష్టాలను తెలుసుకోవడానికి,వారి కన్నీటి దారులను వినడానికి బహుజన సమాజ్ పార్టీ ఆదివారం ఉదయం 10:30 గంటలకు 46వ డివిజన్ లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించి, గడపగడపకు కార్యక్రమం మొదలవుతుందని తెలిపారు.
Spread the love