నవతెలంగాణ-హైదరాబాద్ : ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ డీసీపీ రాధాకిషన్రావుకు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్రావును పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ)లో పనిచేసిన సమయంలో డీఎస్పీ(సస్పెండెడ్) దుగ్యాల ప్రణీత్రావు ఫోన్ట్యాపింగ్ ద్వారా ఇచ్చిన సమాచారం ఆధారంగా క్షేత్రస్థాయిలో రాధాకిషన్రావు బృందం అనధికారిక ఆపరేషన్లు చేపట్టిందనే ఆరోపణలున్నాయి. గురువారం ఉదయం నుంచి బంజారాహిల్స్ స్టేషన్లో రాధాకిషన్రావును విచారించిన దర్యాప్తు బృందం.. ఈరోజు సాయంత్రం గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం కొంపల్లిలోని న్యాయమూర్తి నివాసంలో ప్రవేశపెట్టారు.