ఎస్సై ఫలితాల్లో మండల యువకుడికి పోస్టు

నవతెలంగాణ -మంగపేట: ఆదివారం వెలువడిన తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఫలితాల్లో మండంలోని కమలాపురంకు చెందిన తాటికొండ సాయి శశాంక్ సివిల్ ఎస్సైగా సెలక్ట్ అయ్యారు. కమలాపురం గ్రామంలో డిష్ ఆపరేటర్ గా పని చేస్తున తాటికొండ మాదవచారి, హరిప్రియల కుమారుడు సాయి శశాంక్ 1 నుండి 10 వ తరగతి వరకు గ్రామంలోని తాపర్ విద్యావిహార్ హైస్కూల్ లో చదివి ఉన్నత చదువుల నిమిత్తం హైద్రాబాద్ మీర్ పేటలోని తీగల కృష్ణరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఎస్సై పోస్టులకు ప్రిపేర్ అయినట్లు తెలిపారు. శనివారం వెలువడిన ఎస్సై ఫలితాల్లో కాళేశ్వరం జోన్ -1 నుండి ఓపెన్ కటాఫ్ లో 400/272 మార్కులతో సాయి శశాంక్ ఎస్సై పోస్టుకు సెలెక్టు కావడంతో మండల వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఓ సాదారణ డిష్ ఆపరేటర్ గా జీవితం గడుతుపుతున్న మాదవచారి హరిప్రియల కుమారుడు ఎస్సై గా ఎంపిక కావడం పట్ల ఆ కుటుంబంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి…

Spread the love