మరోసారి తెలంగాణకు రాష్ట్రపతి రాక

నవతతెలంగాణ – హైదరాబాద్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరోసారి తెలంగాణ పర్యటనకు రానుంది. ఇప్పటికే శీతాకాల విడిది కోసం ఒక్కసారి తెలంగాణకు రాగా.. మరోసారి హైదరాబాద్ పర్యటన ఖరారైంది.  మరోవైపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 16, 17వ తేదీల్లో హైదారాబాద్‌కు రానున్న నేపథ్యంలో.. అధికారులు సమావేశం కానున్నారు. రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై రేపు సీఎస్‌ శాంతికుమారి అధ్యక్షతన అధికారులతో సమన్వయ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి కార్యక్రమాలు, షెడ్యూల్ విడుదల కానుంది.

Spread the love