నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ ఎమ్మెల్యే గా అవకాశం కల్పిస్తే ఈ ప్రాంత ప్రజలకు సేవ చేసుకుంటానని కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కోరారు. సోమవారం
హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. నేను హుస్నాబాద్ నియోజకవర్గానికి సేవ చేయడం కోసం నా యొక్క ఓటు ను హుస్నాబాద్ కు మార్చుకోవడం జరిగిందన్నారు. హుస్నాబాద్ నియోజక వర్గంలోని ప్రజలకు ఎమ్మెల్యే ఏమి చేశారో చెప్పాలని అన్నారు. గౌరవల్లి ప్రాజెక్టు ఆనాడు ఉన్న ఆంధ్ర పాలనలో కాంగ్రెస్ పార్టీ 70 శాతం పని పూర్తి చేసిందని, బి అర్ ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలన్నారు.ఈ కార్యక్రమంలో బొలిషెట్టి శివయ్య, కేడలింగమూర్తి, మండల అధ్యక్షులు బంక చందు, పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.