బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరికలు

నవతెలంగాణ – దుబ్బాక రూరల్
దుబ్బాక మండలం పద్మనాభునిపల్లి గ్రామానికి చెందిన  బీఆర్ఎస్  పార్టీకి చెందిన 10 మంది కార్యకర్తలు గన్నెబోయిన రాము గౌడ్,  ఈశ్వరయ్య, బొమ్మ లచ్చయ్య, కండ్ల కొయ్య సత్యనారాయణ, గుండెల్లి మల్లయ్య, మండల యాదగిరి, కండ్ల కొయ్య కరుణాకర్, మండల చంద్రయ్య, కండ్లకోయ సత్తయ్య, కంచర్ల పరుశరాములు కాంగ్రెస్ పార్టీ లోకి బుధవారం చేరారు.ఈ సందర్భంగా వారికీ తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్, తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి, దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ నాయకురాలు కత్తి కార్తిక గౌడ్  కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా కత్తి కార్తీక మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్,బీజేపీ అభ్యర్టులకు డిపాజిట్లు గల్లంతు అవ్వడం ఖాయమని అన్నారు. తొమ్మిదేళ్ళ బీజేపీ, బీఆర్ఎస్ పాలనలో ప్రజలు విసుగు చెందుతున్నారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని అన్నారు .ఈ కార్యక్రమంలో కొత్త దేవి రెడ్డి (బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ దుబ్బాక), రంగనబోయిన దేవస్వామి(ఓబీసీ సెల్ మండల్ అధ్యక్షుడు, దుబ్బాక ),”టిపిసిసి మాజీ ఆర్గనైజింగ్ సెక్రటరీ” కర్నల్ శ్రీనివాసరావు,ఐరేని సాయితేజ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love