సరస్వతి గ్లోబల్ స్కూల్లో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు 

నవతెలంగాణ- దుబ్బాక
దుబ్బాక పట్టణంలోని సరస్వతి గ్లోబల్ స్కూల్లో ప్రధానోపాధ్యాయులు రమేష్ ఆధ్వర్యంలో బుధవారం శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా పాఠశాలలో విద్యార్థినీ, విద్యార్థులు శ్రీ కృష్ణ గోపికల వేషధారణలతో అలరించగా… ఈ వేడుకలు సంతోషకరంగా  జరిగాయనీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు తెలిపారు.అనంతరం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయున్ని విద్యార్థులు శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో ప్రధాన ఆచార్యులు మాలే రమేష్ , కరస్పాండెంట్ కనకా రెడ్డి, ఉపాధ్యాయులు బాబా, యాదగిరి, రాజు, సంధ్యారాణి, మానస తల్లిదండ్రులు తదితరులు ఉన్నారు.
Spread the love