ప్రజా రవాణా వ్యవస్థను మరింత ఆదరించాలి

– మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
– మహాత్మాగాంధీ బస్ స్టేషన్ లో రక్తదాన శిభిరాన్ని ప్రారంభించిన మంత్రి. ఎండీలు:
– ఎంజీబీఎస్ ప్రాంగణంలో మెక్కను నాటిన మంత్రి పువ్వాడ, ఎండీ సజ్జనార్
నవతెలంగాణ -సుల్తాన్ బజార్
ప్రజల ఆకాంక్షల మేరకు ఆర్టీసీని ఆధునీకరిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఈ మేరకు మంగళవారం మహాత్మా గాంధీ బస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కలిసి ప్రారంభించారు. అనంతరం బస్టాండ్లోని మూత్రశాలలు, స్టాల్స్, ప్లాట్ఫాంలను పరిశీలించారు. బస్టాండ్ ప్రాంగణంలో మెక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 101 కేంద్రాలల్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని, దీని ద్వారా సుమారు 8వేల మంది రక్తవాన చేసే చేస్తారన్నారు. తీవ్ర నష్టాల్లో ఉన్న ఆర్టీసీని సీఎం కేసీఆర్ నేతృత్వంలో లాభాల బాట పట్టిస్తున్నామని, ఆర్టీసీ పని చేసే ప్రతి ఒక్కరికి రావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పిస్తామన్నారు. ప్రజలను ఆర్టీసీ వైపు తిప్పేందుకు ఎన్నో ప్రయోగాత్మక నిర్ణయాలు తీసుకుంటూ కొత్త కొత్త పథకాలు తీసుకువస్తున్నానున్నారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ కార్గో సర్వీసులు, మహిళలకు, వయోవృద్దులకు డిస్కౌంట్ టిక్కెట్, ఉచిత మూత్రశాలలు, జీవా మంచినీటి బాటిళ్లతో పాటు బస్టాండు ప్రాంగణాలను ఆడు నీకరిస్తున్నాదున్నారు. కొత్తగా ఎలక్ట్రిక్, ఎసీ, వోల్వో బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ఎండీ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ.. గత రెండేళ్లుగా ఆర్టీసీని ప్రణాలు బాగా ఆదరిస్తున్నారని రాబోయే రోజుల్లో మరింత ఆదరిస్తారనే నమ్మకం ఉందన్నారు త్వరలోనే పిరికి, శ్రీశైలానికి టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్ ఆర్టీసీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సంగ్రామ్ సింగ్ టీ పాటిల్, ఈడీలు పురుషోత్తం. మునిశేఖర్. కృష్ణకాంత్, రంగారెడ్డి ఆర్ఎం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love