జమ్ముకాశ్మీర్‌లో రోడ్డు ప్రమాదం

– నలుగురు మృతి
శ్రీనగర్‌ : జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తానామండి ఏరియాలో ఓ కారును బుధవారం గుర్తు తెలియని వాహనం ఢకొీట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. స్థానికుల సాయంతో క్షతగాత్రులను కారులోంచి బయటకు తీసి రాజౌరిలోని గవర్నమెంటు మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ అసోసియేటెడ్‌ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టు మార్టానికి పంపారు.
ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. కారును ఢకొీట్టిన వాహనాన్ని గుర్తించేందుకు సిసి ఫుటేజ్‌ను పరిశీలించనున్నట్లు తెలిపారు.

Spread the love