ఎస్‌బీఐ ‘హర్‌ ఘర్‌ తిరంగా’

‘హర్‌ ఘర్‌ తిరంగా’ క్యాంపెయిన్‌హైదరాబాద్‌ : ఆజాది కా అమృత్‌ మహోత్సవ్‌ (అకమ్‌) కార్యక్రమాల్లో భాగంగా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ‘హర్‌ ఘర్‌ తిరంగ’ క్యాంపెయిన్‌ను నిర్వహించనున్నట్లు పేర్కొంది. సోమవారం ఎస్‌బిఐ లోకల్‌ హెడ్‌ ఆఫీస్‌, కోటీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆ బ్యాంక్‌ డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అమిత్‌ జింగ్రన్‌, హైదరాబాద్‌ సర్కిల్‌ సిజిఎం రాజేష్‌ కుమార్‌, డిజిఎం మంజూ శర్మ పాల్గొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా హర్‌ గర్‌ తిరంగా క్యాంపెయిన్‌లో భాగంగా ప్రతీ ఉద్యోగి, సిబ్బంది జాతీయ జెండాతో సెల్ఫీ దిగి దేశభక్తిని చాటుకోవాలని సూచించారు.

Spread the love