వెస్ట్ బెంగాల్ లో జరిగే వాలీబాల్ పోటీకి ఎంపిక

నవతెలంగాణ – నసురుల్లాబాద్
వెస్ట్ బెంగాల్ జరిగే జాతీయస్థాయి సబ్ జూనియర్ వాలీబాల్ పోటీలకు నెమ్లీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 10 వ తరగతి విద్యార్థి వి, నరేందర్ ఎంపికైనట్లు గురువారం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకట రమణ ఓ ప్రకటనలో తెలిపారు. మండల స్థాయి, జిల్లా స్థాయి ప్రతిభ కనబరిచిన విద్యార్థి నరేందర్ ఈ నెల 28 నుండి 31 వరకు జాతీయ స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ వెస్ట్ బెంగాల్ లో కలదు. వీరి ఎంపిక పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటరమణ, గ్రామ సర్పంచ్ పందిరి గంగామణి భూమేష్ , ఎంపిటిసి నాయిని రాధ హనుమాన్లు, పిఈటీ సురేందర్ ,ఉపాధ్యాయ బృందం మరియు పూర్వ విద్యార్థులు ప్రతాప్ సింగ్ , మరియు గ్రామస్తులు విద్యార్థిని అభినందించారు.

Spread the love