బీహార్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి..

నవతెలంగాణ – హైదరాబాద్: బీహార్‌లోని ఖగారియా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఏడుగురు చనిపోయారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే ఖగారియాలోని పస్రాహా ప్రాంతంలోని పెట్రోల్ బంకు దగ్గర ట్రాక్టర్, జీపు ఎదురెదురుగా ఢీకొని ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారుల సహా ఏడుగురు మరణించారు. ఉదయం ఏడుగంటల సమయంలో ప్రమాదం జరిగిందని తెలిపారు అధికారులు. జీపులో ప్రయాణిస్తున్న వారు పెళ్లి వేడుకకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ట్రాక్టర్‌లో ఓవర్‌లోడ్‌ వచ్చిందని.. జీపులో ఉన్న వారు అక్కడికక్కడే మృతి చెందారని తెలిపారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. ఈ ప్రమాదం పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.  డెడ్ బాడీలను పోస్ట్ మార్టానికి పంపామని ఖగారియా ఎస్పీ స్పష్టం చేశారు.

Spread the love