సాఫ్ట్ బాల్ ఎంపికైన మిట్టపల్లి క్రీడాకారుడు వినయ్ సన్మానించిన ఎమ్మెల్యే

– పది వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేత
నవతెలంగాణ – డిచ్ పల్లి
ఈనెల 23 నుండి 24 తేదీలలో జపాన్ దేశంలోని కొచ్చి లో జరిగే ఏషియా జూనియర్ సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికైన డిచ్ పల్లి మండలం లోని మిట్టపల్లి క్రీడాకారుడు గుండా వినయ్ ని రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆదివారం ఘనంగా సన్మానించి రవాణా ఖర్చులకోసం ఆర్థిక సహాయం పది వేల నగదును అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ క్రీడాకారుని ఉద్దేశించి మాట్లాడుతూ జపాన్లో జరిగే ఛాంపియన్షిప్లో భారత జట్టును ముందు వరసలో నిలపడానికి కృషి చేయాలి విజయం సాధించుకొని రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ సాంబార్ మోహన్, జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు వి ప్రభాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మర్కంటి గంగా మోహన్, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం ప్రధాన కార్యదర్శి బొజ్జ మల్లేష్ గౌడ్, జడ్పీటీసీ ఇందిరా లక్మి నర్సయ్య పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు ఓడ్డo నర్సయ్య, సర్పంచ్ తేలు గణేష్, ఎంపీటీసీ బాలగంగాధర్, , ఉప సర్పంచ్ తంగెళ్ల కిషన్, గ్రామ టిఆర్ఎస్ నాయకులు గంగరత్నం, గుండా అశోక్, సాఫ్ట్ బాల్ అకాడమీ కోచ్ ఇట్యాల నరేష్ తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో ఘనంగా సన్మానం. ఈనెల 23 నుండి 24 తేదీలలో జపాన్ దేశంలోని కొచ్చి లో జరిగే ఏషియా జూనియర్ సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికైన డిచ్ పల్లి మండలం లోని మిట్టపల్లి క్రీడాకారుడు గుండా వినయ్ ను ఆదివారం గ్రామంలో ఘనంగా సన్మానించారు.

Spread the love