నవతెలంగాణ-హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూలతల కారణంగా మన మార్కెట్లు లాభాల్లో కొనసాగాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 90 పాయింట్లు లాభపడి 73,738కి చేరుకుంది. నిఫ్టీ 32 పాయింట్లు పెరిగి 22,368 వద్ద స్థిరపడింది. మెటల్, హెల్త్ కేర్, ఆయిల్ అండ్ గ్యాస్, ఎనర్జీ సెక్టార్లు మినహా మిగిలిన అన్ని సూచీలు లాభపడ్డాయి. టెలికాం సూచీ 4.27 శాతం, రియాల్టీ సూచీ 2.42 శాతం పెరిగాయి.