భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు..

నవతెలంగాణ – ముంబాయి: స్టాక్ మార్కెట్లు ఈరోజు మళ్లీ భారీగా లాభపడ్డాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 340 పాయింట్లు లాభపడి 65,786కి చేరుకుంది. నిఫ్టీ 99 పాయింట్లు పెరిగి 19,497 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్: మహీంద్రా అండ్ మహీంద్రా (4.97%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (3.79%), టాటా మోటార్స్ (2.12%), రిలయన్స్ (1.60%), ఎన్టీపీసీ (1.60%).
టాప్ లూజర్స్: మారుతి (-1.40%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.23%), బజాజ్ ఫైనాన్స్ (-1.05%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.76%), టాటా స్టీల్ (-0.22%).

Spread the love