హీరో నిఖిల్ తన 20వ సినిమా కోసం దర్శకుడు భరత్ కష్ణమా చారితో జతకట్టారు. ‘స్వయంభు’ టైటిల్తో ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ పతాకంపై భువన్, శ్రీకర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. నిఖిల్ను ఫెరోషియస్ వారియర్గా చూపించిన ఫస్ట్లుక్ పోస్టర్కు అద్భుతమైన స్పందన వచ్చింది.శ్రావణ శుక్రవారం పర్వదినం సందర్భంగా మేకర్స్ గ్రాండ్ లాంచింగ్ వేడుకను నిర్వహించారు.చిత్రబృందం, ప్రత్యేక అతిథుల సమక్షంలో ఘనంగా ప్రారంభోత్సవం జరిగింది. దిల్ రాజు కెమెరా స్విచాన్ చేయగా, అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు. గీత రచయిత రామజోగయ్య శాస్త్రి తొలి షాట్కి దర్శకత్వం వహించారు. చదలవాడ శ్రీనివాసరావు స్క్రిప్ట్ని మేకర్స్కి అందజేశారు.
ఈ కార్యక్రమానికి నిర్మాతలు అభిషేక్ అగర్వాల్, సితార నాగవంశీ, దామోదర్ ప్రసాద్ హాజరయ్యారు. సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. నిఖిల్ యోధుడిగా గుర్రపు స్వారీ చేస్తూ డ్రాగన్పై బాణం వేస్తున్నట్లు కనిపించిన పోస్టర్తో ఈ సినిమా అనౌన్స్మెంట్ చేశారు.
ఫస్ట్లుక్ పోస్టర్లాగే ఈ కొత్త పోస్టర్ నెక్స్ట్ లెవల్లో ఉంటూ సినిమాపై అంచనాలను మరింతగా పెంచింది. నిఖిల్ కెరీర్లోనే అత్యంత భారీ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో నిఖిల్ సరసన సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: రవి బస్రూర్, డీవోపీ: మనోజ్ పరమహంస, డైలాగ్స్: వాసుదేవ్ మునెప్పగారి, ప్రొడక్షన్ డిజైనర్: ఎం ప్రభాహరన్, సహ నిర్మాతలు: విజరు కామిశెట్టి, జిటి ఆనంద్.