అందుకే నాయకులంతా పార్టీని వీడుతున్నారు..కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు

నవతెలంగాణ-హైదరాబాద్ : పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్ తగిలే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో ఆరు నెలల ముందు నుంచే కేసీఆర్ ఎవరికీ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. అందుకే నాయకులంతా పార్టీని వీడుతున్నారు అని అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే, తాజాగా గుత్తా కాంగ్రెస్ నేతలతో టచ్‌లోకి వెళ్లారని వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ నేతల నుంచి స్పష్టమైన హామీ సైతం రావడంతో ఆ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. ఇదే నిజమైతే నల్లగొండలో బీఆర్ఎస్‌కు భారీ దెబ్బ పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Spread the love