నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని పల్లే పల్లేలలో నూతనంగా జుక్కల్ మండల కాంగ్రేస్ పార్టీ అద్యక్షుడిగా నియమింపబడ్డ పదవి బాద్యతలు చేపట్టిన కాంగ్రేస్ పార్టీ సీనీయర్ నాయకుడు వజ్రఖండి గ్రామ మాజీ సర్పంచ్ సంజీవ్ పటేల్ ను ఎమ్మెలే క్యాంపు గ్రామాల కాంగ్రేస్ కార్యకర్తలు కలిసి సన్మానించారు. ఈ సంధర్భంగా ఖండేభల్లూర్, గుండూర్, మథురాతాండా సంభందించిన మాజీ సర్పంచులు, సీనీయర్ నాయకులు క్యాంపు కార్యాలయానికి తరలివచ్చారు. పార్టీ అద్యక్షుడు సంజీవ్ పటేల్ మాట్లాడుతు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావ్ సహకారంతో గ్రామాలలో పార్టీ కార్యకర్తలకు అండగా ఉండి, పార్టీ బలోపేతానికి, పటిష్టతకు కృషి చేస్తానని, మండలంలోని అన్ని గ్రామాలలో పర్యటించి కాంగ్రేేస్ నాయకులకు కలిసి రాబోయే పార్ల మెంట్ ఎన్నికలలో అందరం కలిసి ఎమ్మెలే ఆదేశాలతో ఎంపిని బారీ మేజార్టీ తో గెలిపించుకుందామని కార్యకర్తలతో మాట్లాడారు. కార్యక్రమంలో గుండూర్ కాంగ్రేస్ పార్టీ గ్రామ అద్యక్షుడు మారుతీ పటేల్, నాయకులు ప్రకాశ్ పటేల్, మారుతీ పటేల్, సంజీవ్ పటేల్, సంజీవ్, బాబు, కార్యకర్త ప్రసాద్, ఖండేబల్లూర్ గ్రామనాయకులు రాజేందర్ సింగ్ తదితరులు పాల్గోన్నారు.