నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనంచేయడంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించి వచ్చిన అధ్యయన బృందం నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామని ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్ బాబు, కే రాజిరెడ్డి తెలిపారు. మంగళవారం హైదరాబాద్లోని యూనియన్ రాష్ట్ర కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల అనంతరం రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యయన బృందం పరిశీలించిన అంశాలపై విశ్లేషణ చేసి, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజరుకుమార్కూ, విలీన కమిటీ చైర్మెన్ రామకృష్ణారావుకు వినతిపత్రాలు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఈ సందర్భంగా రావల్సిన రెండు వేతన సవరణలు సహా పలు అంశాలపై చర్చించినట్టు తెలిపారు.