ఆలూరు మండల నాయికపొడు సంఘం ఏకగ్రీవ ఎన్నిక..

నవతెలంగాణ – మాక్లూర్
ఆలూరు మండలంలోని నాయికపొడు మండల సేవసంగంను ఏకగ్రీవంగా శుక్రవారం ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలను నిజామామాద్ జిల్లా ఆదివాసి నాయకుడు సేవాసంఘం జిల్లా అధ్యక్షులు గాండ్ల రాంచందర్ ఆద్వర్యతో అబూరు మండల కమిటీ ఎన్నికలు నిరహించడం జరిగింది. ఈ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఆలూరు ఆదివాసి నాయకపోడు సేవాసంఘం అద్యక్షులుగా పుట్టకిరణ్ (ఆలూర్), ప్రధాన కార్యదర్శిగా తౌడు మహేష్ (రాంచంద్రాపల్లి), సార్ల క్షడిగా (శ్రీకాంత్ (పేణం), జాయింట్ సెక్రెటరీగా మంథని పవన్ (ఆలూర్), కోశాధికారిగా భోజన్న, ఉపాధ్యక్షులుగా గట్టు నర్సయ్య (దేగాం) లను ఏకాగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఆద్యాక్షులు గాండ్ల రాంచందర్ మాట్లాడుతూ మన కుల సంఘాన్ని రాజకీయులకు అతీతంగా అందరం కలిసి కృషిచేసి అభివృద్ధి చేసుకుందమని, అలాగే ప్రభుత్వ పథకాలను కులసంఘంలోని లబ్దిదారులకు అందేవిధంగా కృషి చేసుకోవాలని తెలిజేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయికపోడు సేవ సంఘం సభ్యులు పాల్గొన్నారు.
Spread the love