బూత్‌ కమిటీల కృషితోనే ఎంపీ ఎన్నికల్లో విజయం

– ఎమ్మెల్యే ప్రకాష్‌ గౌడ్‌
– బూత్‌ కమిటీ నాయకులకు నిర్దేశం
నవతెలంగాణ-శంషాబాద్‌
బూత్‌ కమిటీల కృషితోనే ఎంపీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఘనవిజయం సాధించే అవకాశం ఉందని రాజేం ద్రనగర్‌ ఎమ్మెల్యే టి.ప్రకాష్‌ గౌడ్‌ అన్నారు. చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ను గెలిపించడం కోసం ఆయన శుక్రవారం బూత్‌ స్థాయి కమిటీ నాయకులతో ఎమ్మెల్యే నివాసంలో సమావేశం నిర్వహించారు. మండలంలోని మల్కారం నానాజీపూర్‌, సుల్తాన్‌పల్లి కాచారం గ్రామాల పార్టీ బూత్‌స్థాయి కమిటీలను ఎమ్మెల్యే సమక్షంలో నియ మించారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ..జరగబోయే ఎంపీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలిపే ధ్యేయంగా గడపగడపకూ వెళ్లి ఓటర్లను చైతన్య పరుస్తున్న ఘనత బూత్‌ కమిటీ నాయకులకే చెందింద న్నారు. గడిచిన 10 ఏండ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను గురించి ప్రజ లకు వివరించాలని సూచించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హామీలను నెరవేర్చే విషయంలో విఫలమైందని ప్రజలకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. ప్రజలను సమీకరించి అవగాహన కల్పించి వారి నుంచి బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థికి అధికంగా ఓట్లు సాధించే దిశగా కంకణ బద్ధులై కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు చంద్రారెడ్డి, నీరటి రాజు ముదిరాజ్‌, రాజ శేఖర్‌గౌడ్‌, దండు ఇస్తారి తదితరులు పాల్గొన్నారు.

Spread the love