నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ నాయకులు ఓటుకు నోటు పట్టుబడ్డ కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ కేసును జూలై 24కు వాయిదా వేస్తున్నట్లు సుప్రీం కోర్టు వెల్లడించింది . 2015లో ఓటుకు నోటు కేసులో టీడీపీ నాయకుడు చంద్రబాబు, రేవంత్ రెడ్డిని ఏసీబీ అధికారులు రెడ్హ్యండెడ్గా పట్టుకున్నారు. కేసు విచారణలో జాప్యం జరుగుతుండడంతో వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన మేరకు గురువారం మరోసారి విచారణకు వచ్చింది . కోర్టు వేసవి సెలవుల అనంతరం విచారణ చేపట్టాలని చంద్రబాబు, రేవంత్రెడ్డి తరుఫున న్యాయవాదులు కోర్టును కోరడంతో కోర్టు సానుకూలంగా స్పందించింది.