బీజేపీపై మండిపడ్డ మంత్రి పొన్నం

నవతెలంగాణ – కరీంనగర్‌: రాష్ట్రానికి పదేళ్లలో బీజేపీ ఏం చేసిందో చెప్పాలని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. బీఆర్ఉస్ మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ ఏం చేశారో చెప్పాలన్నారు. గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని, రైతులకు బోనస్‌ తప్పకుండా ఇస్తామమన్నారు. కరీంనగర్‌ జిల్లా అలుగునూరులో నిర్వహించిన కాంగ్రెస్‌ లోక్‌సభ ఎన్నికల సన్నాహక భేటీలో ఆయన మాట్లాడారు. పదేళ్లలో మాజీ సీఎం కేసీఆర్‌ రూ.7 లక్షల కోట్లు అప్పులు చేశారని విమర్శించారు. కేసీఆర్‌ దుర్మార్గ పాలనకు బీజేపీ కూడా సహకరించిందన్నారు. వేములవాడ, కొండగట్టు, కాళేశ్వరం, ధర్మపురికి ‘ప్రసాద్‌ పథకం’ నిధులు ఇవ్వలేదని విమర్శించారు.

 

Spread the love