నవతెలంగాణ-శేరిలింగంపల్లి
చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికలు సాఫిగా నిర్వహించేం దుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని శేరిలింగంపల్లి జోనల్ఎ కమిషనర్, ఎన్నికల అధికారి స్నేహ శబరిష్ తెలి పారు. ఇప్పటికే నోడల్ ఆఫీసర్లను నియమించి, ఎవరి బాధ్యతలు వారికీ అప్పగించామని, వారి వారి విధుల్లో ని మగమయ్యారని పేర్కొన్నారు. వాకర్స్, ఓటర్లు ఓటింగ్ లో పాల్గొనడం కోసం అవగాహనా కల్పిస్తున్నారు. గచ్చి బౌలి స్పోర్ట్స్ స్టేడియంలో క్రీడాకారులు, పిల్లలతోపిల్లలు ఓటింగ్ సందేశాన్ని తీసుకోవాలని తెలిపారు. కూకట్పల్లి వద్ద భాగ్యనగర్ సంక్షేమ సంఘం, జీపీఆర్ఏ క్వార్టర్స్లో ఓటర్లకు అవగాహనా కల్పించారు. పోలింగ్ రోజున ర వాణా నిమిత్తం 66 పెద్ద బస్సులు, 72 మినీ బస్సులు ఏ ర్పాటు చేయబడ్డాయని, 11,454/ విలువ చేసే 16.44 లీటర్ల మధ్యాన్ని నోడల్ ఆఫీసర్,ఎక్సైజ్ సిబ్బంది 16. 09లీటర్లు, 8,306.50 విలువ చేసే 16.09 లీటర్ల మ ద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మొత్తం 757874 ఓటర్ స్లిప్స్ ఉం డగా ఇప్పటి వరకు 129008 స్లిప్పులు పంపిణి చేశామ ని, ఇంకా పెండింగ్: 628866 స్లిప్పులున్నాయని సంబం ధిత అధికారులు తెలిపారు.