మతాల పేరుతో చిచ్చు పెడుతున్న బీజేపీని ఓడించాలి

– కాంగ్రెస్ పార్టీ మహబూబాద్ పార్లమెంటు అభ్యర్థి పోరిక బలరాం నాయక్ ని గెలిపిస్తే భారతదేశ అభివృద్ధి

– మే 3న జిల్లా కేంద్రంలో పార్లమెంటు స్థాయి బహిరంగ సభ
– సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి బి విజయ సారథి
నవతెలంగాణ – నెల్లికుదురు
మతాల పేరుతో చిచ్చు పెడుతున్న బీజేపీ పార్టీని ఓడించాలని సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి విజయసారధి అన్నాడు. ఇండియా కూటమి బలపరిచిన మానుకోట కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ ను గెలిపించాలని మంగళవారం మండలంలోని శ్రీరామగిరి మునిగలవీడు నెల్లికుదురు గ్రామాల్లో ప్రజల వద్దకు వెళ్లి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  బీజేపీ అనుసరిస్తున్న విధానాలు ఏ ఒక్కరి కూడా మేలు లేవని బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డాడు. లోకసభ ఎన్నికలు జరగబోతున్నందున మళ్లీ ప్రజల మోసం చేసి పెద్ద నేక్కాలని చూస్తున్న మోడీ ప్రభుత్వాన్ని ప్రజల గమనిస్తున్నారని అన్నారు. మోడీ ప్రభుత్వం గత 10 ఏండ్ల బీజేపీ పాలనలో దేశ ప్రజలకు చేసిన మేలు లేదని తెలిపాడు. కేవలం కార్పొరేట్ కంపెనీలకు లాబీగా పాలించిండే తప్ప మోడీ ప్రజా సంక్షేమాన్ని పట్టించుకున్న పాపన్న పోలేదని ఆవేదన వ్యక్తం చెందాడు. ఇప్పుడు ఎలాగైనా అధికారం చేపట్టాలని అయోధ్య రాముడు శ్రీరాముని పేరుతో ముందుకు వస్తున్నారని అన్నారు. భారతదేశం మొత్తం శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నామని ఇప్పుడే కొత్తగా ఈ వేడుకలు నిర్వహించుకుంటలేమని అన్నాడు. ఇక్కడ ప్రాంత రైతుల పండించిన పంటను అయినటువంటి బియ్యం గింజలను తీసుకెళ్లి వారు మళ్లీ తిరిగి అక్షింతల పేరుతో ఇంటింట ప్రచారం  నిర్వహిస్తున్నాడని అన్నారు. మతాల పేరుతో కులాల పేరుతో ఉద్దేశపూడిత మాటలు మాట్లాడి అల్లాలు సృష్టించే విధంగా చేస్తున్న బీజేపీని ప్రజలు సహించరని అన్నారు ఏ రాష్ట్రంలో దళిత మహిళలను విచ్చలవిడిగా నానా రకాలుగా ఇబ్బందులు పెడుతుంటే, కనీసం అక్కడ ఉన్న బీజేపీ ప్రభుత్వం పట్టించుకోకుండా కనీసం నెట్వర్క్ లేకుండా ఇంటర్నెట్ సౌకర్య లేకుండా చేసి నీచమైన రాజకీయాలకు దిగారని అన్నారు బీజేపీ పార్టీ మోడీ ప్రభుత్వం మాయమాటలతో కాలయాపన చేశారు తప్ప రైతులకు గాని ప్రజలకు గాని చేసిన మేలు ఏమి లేదని అన్నాడు. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థులను బలపరిచి భారీ మెజార్టీతో గెలిపిస్తే దేశంలో సూపరిపాలన అందిస్తామని హామీ ఇచ్చారు. సీపీఐ (ఎం) పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు తెలిపారు. మహబూబాద్ పార్లమెంటు అభ్యర్థి బలరాం నాయకులు భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను తెలిపారు.
మే 3న సీపీఐ ఎన్నికల బహిరంగ సభ..
మానుకోట కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ గెలుపును కోరుతూ మే మూడున మానుకోట జిల్లా కేంద్రంలో సీపీఐ ఎన్నికల బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభకు కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల ఇన్చార్జి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, మానుకోట డోర్నకల్ ఎమ్మెల్యేలు మురళి నాయక్ రామచంద్రనాయక్, అభ్యర్థి బలరాం నాయక్ సీపీఐ రాష్ట్ర నేత తక్కలపల్లి శ్రీనివాసరావు హాజరవుతున్నందున ఈ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి వరిపల్లి వెంకన్న మండల సహాయ కార్యదర్శిలు తూటి వెంకట్రెడ్డి, బైస స్వామి సీనియర్ నాయకులు చిర్ర సత్యనారాయణ,మాలోత్ రవీందర్ నాయక్,గార అనిల్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.
Spread the love