ఆగపల్లిలో ప్రపంచ బ్యాంక్‌ టీమ్‌ సందర్శన

స్వయం సహాయక సంఘాల సభ్యులతో చర్చ
నవతెలంగాణ-మంచాల
మంచాల మండల పరిధిలోని ఆగపల్లి గ్రామంలో ప్రపంచ బ్యాంక్‌ టీం సందర్శనలో భాగంగా పల్లె సమగ్ర కేంద్రం, స్వయం సంఘాల సభ్యుల తో చర్చించి సమా చారం తీసుకున్నట్టు ఎంపీడీవో శ్రీనివాస్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదట పల్లె సమగ్ర కేంద్రంను సందర్శించి పనితీరు తెలుసుకుని, ఏయే లావా దేవీలు చేస్తారని, మహిళలకు ,ప్రజలకు ఏలాంటి సేవలు అందిస్తున్నారని అడిగి తెలుసుకున్నట్టు తెలిపారు. తదనం తరం స్వయం సహాయక సంఘాలు సభ్యులను కలిసి వారి సంఘాల ఏర్పాటు, సంఘం ద్వారా ఏం లాభం పొందారని తెలుసుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో స్త్రీ నిధి రీజినల్‌ మేనేజర్‌ ఉదయ కుమారి, ఏపీఎం శోభ, పంచా యతీ కార్యదర్శి అనిల్‌, స్త్రీ నిధి మేనేజర్‌ సత్యం, సీసీ సుజా త, జైపాల్‌రెడ్డి, లాల్‌ సింగ్‌, వీఓఏలు సంతోష, పద్మ, ఇంది రా, స్వయం సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love