యువ సాహిత్య ప్రతిభా పురస్కారం

కుసుమ ధర్మన్న కళా పీఠం ఆధ్వర్యంలో యువ సాహిత్య ప్రతిభా పురస్కారం కోసం యువకవుల/ కవయిత్రులు నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. కనీసం నాలుగు కవితలు ప్రముఖ పత్రికల్లో ప్రచురింపబడి నాలుగు పోటీలలో విజేతలుగా నిలిచిన వారు, 18 నుండి 35 ఏండ్లలోపు వారై ఉండాలి. విజేతలుగా నిలిచిన వారికి రూ.5,116/- బహుమతి అందజేస్తారు. ఆసక్తి కలిగిన వారు ఆగస్టు 31లోగా 9490841284 వాట్సాప్‌ నంబరుకు పంపవచ్చు. సెప్టెంబర్‌లో హైదరాబాద్‌లో నిర్వహించే సభలో పురస్కారం అందిస్తామని కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్‌ రాధా కుసుమ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Spread the love