సునామీ

ఎప్పుడు ఎలా ప్రవేశించిందో తెలియదు
వాడి సర్వ వ్యవస్థలూ దానికి జోహుకుం
అయినాయి కరోనా కంటే వేగంగా
వాడి నరనరాన వ్యాపించింది చూడటానికి
ఇంకా మనిషిలా కనిపించే నరపిశాచిగా
మార్చేసింది మనిషితనాన్ని మింగి ద్వేషపు
విషాన్ని కక్కుతోంది ఆ
విద్వేషపు రక్కసిని దునుమాడేందుకు
జనసంద్రపు అల(ల)జడి సరిపోదు ఏకంగా
ఆ తల్లి కడుపు కల్లోలం ఊపిరులూదిన
సునామీ నెత్తుటిగుడ్డుకు పురుడు
పోయాలిప్పుడు…
– కట్టా సత్య ప్రసాద్‌

Spread the love