ఒక ప్రాణానికి ఇంకో ప్రాణం..

హీరో ఆది సాయికుమార్‌ తాజాగా నటించిన క్రైమ్‌ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ ‘సీఎస్‌ఐ సనాతన్‌’. ఇందులో మిషా నారంగ్‌ హీరోయిన్‌గా నటించింది. చాగంటి ప్రొడక్షన్‌ బ్యానర్‌పై శివశంకర్‌ దేవ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మార్చి 10న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. విక్రమ్‌ చక్రవర్తి అనే కార్పొరేట్‌ లీడర్‌ ప్రసంగిస్తూ భారత ఆర్ధిక వ్యవస్థని ఎత్తున నిలబెట్టడమే తన లక్ష్యం అని చెబుతుంటాడు. ఆ వెంటనే అతను చనిపోయి కనిపిస్తాడు. సనాతన్‌ ఈ మిస్టరీ మర్డర్‌ని ఇన్వెస్టిగేట్‌ చేస్తూ 5గురు నిందితులను అరెస్ట్‌ చేసి తన శైలిలో విచారిస్తాడు. ఒక మహిళ అతను చాలా మంచివాడని చెప్పడం, ఇంకొకరు అతను ఆడవాళ్లతో అసభ్యంగా ప్రవర్తిస్తాడని చెప్పడం ఇలా చిత్ర విచిత్రమైన సన్నివేశాల మధ్య ఇన్వెస్టిగేషన్‌ జరుగుతుంది. నిజాన్ని అస్సలు ఊహించలేమని హీరో అంటుండగా ‘ఒక ప్రాణానికి ఇంకో ప్రాణం’ లాంటి పదాలతో ఉత్కంఠ భరితంగా సాగిన ట్రైలర్‌ అందర్నీ అలరిస్తోంది. మార్చి 10న విడుదలవుతున్న ఈ చిత్రంపై నిర్మాతలు ఎంతో నమ్మకంగా ఉన్నారు’ అని చిత్ర బృందం తెలిపింది.

Spread the love