104 కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి..

– కోఠి డిఎం హెచ్ ఎస్ ఆవరణలో మహాధర్నా..

– తెలంగాణ యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటి అనుబంధం) గౌరవ అధ్యక్షులు భూపాల్ డిమాండ్ 
నవ తెలంగాణ -సుల్తాన్ బజార్
రాష్ట్రంలోనిప్రభుత్వ వైద్య శాఖలో పనిచేస్తున్న 104 కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని  తెలంగాణ యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ (టి యు ఎం హెచ్ ఈ యు-సిఐటియు అనుబంధం) రాష్ట్ర గౌరవ అధ్యక్షులు భూపాల్ డిమాండ్ చేశారు. గురువారం కోఠి లోని డిఎంహెచ్ఎస్ ఆవరణలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన 104 కాంట్రాక్టు ఉద్యోగులు పెద్ద ఎత్తున మహా ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. గత నాలుగు నెలలుగా 104 కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. 104 ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 104 ఉద్యోగులు 2008 నుండి డీఎస్సీ ద్వారా రూల్ ఆఫ్ రిజర్వేషన్. రోస్టర్ పాయింట్ పద్ధతిలో జీఓ నెం 1636. మెమో నెం20639ల ప్రకారము పూర్తిగా ప్రభుత్వం ఆధీనంలోనే (డ్రైవర్లు. డేటాఎంట్రీ ఆపరేటర్లు. ల్యాబ్ ఫార్మసిస్టులు. సెక్యూరిటీ గార్డులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏఎన్ఎంలు)1.350 మంది విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. గత 15 ఏళ్లుగా 104 ఉద్యోగులు ఎలాంటి ఉద్యోగ భద్రత లేకుండా. చాలీచాలని వేతనాలతో సేవలు అందిస్తున్నారని తెలిపారు. 29 -10- 2022 నుండి వాహనాలను ప్రభుత్వం పూర్తిగా నిలిపివేసిన సందర్భంగా ఉద్యోగ భద్రత కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపారు. ఉద్యోగులను పిహెచ్ సి. సిహెచ్ సి లు. ఏరియా హాస్పిటల్ లలో. టి. హబ్ సెంటర్లలో ఉద్యోగులను రీ -డిప్లై ప్రభుత్వం 104 రెగ్యులరైజేషన్ కు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ప్రభుత్వం రెగ్యులర్ చేయడం లేదని మండిపడ్డారు.జ ఓనెం. 60 ప్రకారం ఉద్యోగులకు స్లాబుల పద్ధతి వేతనాలు చెల్లించడం వలన తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. వీరందరికీ ప్రభుత్వమే నేరుగా జీతాలు అందించాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి హైదరాబాదులో ఉన్న ఏఎన్ఎం లను. రెండవ ఏఎన్ఎంలుగా గుర్తించి రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు.104 ఉద్యోగులకు వారు ఇచ్చిన ఆప్షన్ ప్రకారం సొంత జిల్లాలకు బదిలీలు చేయాలన్నారు. హెల్త్ కార్డు లేదా ఆరోగ్య భీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు104 ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ ధర్నాలో 104 ఉద్యోగనాయకులు సుభాష్ చందర్. గాదె శ్రీనివాస్. వెంకన్న .నవీన్. రచ్చ రవీందర్. విద్యాసాగర్. సతీష్ కృష్ణ ప్రసాద్ .ఎండి మాజీ ద్. సంతోష్. ఫార్మసిస్ట్ శ్రీధర్ స్వామి. ఫార్మసిస్ట్ మల్లికార్జున్. హనుమంతరావు ‌. విజయ్ కుమార్ రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
Spread the love