నవతెలంగాణ-నేరేడ్ మెట్
ఓల్డ్ ఆల్వాల్ అంబేద్కర్ నగర్లో నివాసం ఉంటున్న మున్ని అనే మహిళకు నలుగురు కుమార్తెలు. మున్ని భర్త చనిపోగా నలుగురు కూతుర్లను అద్దె ఇంట్లో ఉంటూ పెంచి పెద్ద చేసింది. మున్ని తన నాలుగో కూతురు పెండ్లి కోసం ఇబ్బంది పడుతూ సహాయాన్ని కోరుతూ మల్కాజిగిరికి చెందిన మానవసేవే మాధవసేవ గ్రూపు సభ్యుడు గణేష్ని సంప్రదించారు. సదరు విషయాన్ని గణేష్ గ్రూప్ అడ్మిన్ కుమ్మరి రాజుకు తెలియజేయడంతో అతను గ్రూప్ సభ్యులతో మాట్లాడి వారి సహకారంతో గురువారం రేష్మ పెండ్లి కోసం తల్లి మున్నీకి 10000 రూపాయల చెక్కును ఆర్థికసాయంగా అందజేశారు. అందుకు గ్రూప్ సభ్యులకు మున్ని ధన్యవాదాలు తెలియజేశారు. గ్రూప్ అడ్మిన్ కుమ్మరి రాజు, ఉదారి సత్యనారాయణ,గణేష్ తదితరులు పాల్గొన్నారు.