ఘనంగా బ్రో విజయోత్సవం

పవన్‌ కళ్యాణ్‌, సాయి ధరమ్‌ తేజ్‌ మొదటిసారి కలిసి నటించిన చిత్రం ‘బ్రో’. జీ స్టూడియోస్‌తో కలిసి పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి.విశ్వప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహించారు. త్రివిక్రమ్‌ స్క్రీన్‌ ప్లే, డైలాగ్స్‌ అందించిన ఈ సినిమాలో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్‌ వారియర్‌ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఇటీవల విడుదలై విశేష ఆదరణ పొందుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బ ందం విజయోత్సవ సభను ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా సాయి ధరమ్‌ తేజ్‌ మాట్లాడుతూ.’ఈ సినిమాలో మా మావయ్య పవన్‌ కళ్యాణ్‌తో కలిసి నటించే అవకాశం ఇచ్చిన పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీకి థ్యాంక్స్‌. సముద్రఖని గురించి ఎంత చెప్పినా తక్కువే. తమన్‌ నేేపథ్య సంగీతంతో కట్టిపడేసాడు. కళ్యాణ్‌ మావయ్య గురించి, త్రివిక్రమ్‌ గురించి మాట్లాడే అంత అర్హత నాకు లేదు. ఈ చిత్రాన్ని బ్లాక్‌ బస్టర్‌ చేసిన ప్రేక్షకులు అందరికీ ధన్యవాదాలు’ అని చెప్పారు.
”పవన్‌ కళ్యాణ్‌, సాయి ధరమ్‌ తేజ్‌ కలయికలో మా 25 వ సినిమా చేయడం సంతోషంగా ఉంది. ఇంత మంచి సినిమాని త్రివిక్రమ్‌ తన సంభాషణలతో ప్రేక్షకుల హదయాల్లోకి తీసుకెళ్లారు. పవన్‌ కళ్యాణ్‌ అభిమానులతో పాటు, కుటుంబ ప్రేక్షకులు మెచ్చే చిత్రమిది. డిస్ట్రిబ్యూటర్స్‌ అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. దర్శకుడు సముద్రఖని అద్భుతంగా ఈ సినిమాని తెరకెక్కించారు’ అని నిర్మాత టి.జి. విశ్వప్రసాద్‌ అన్నారు.
సహ నిర్మాత వివేక్‌ కూచిబొట్ల మాట్లాడుతూ, ”ముందు నుంచి అనుకున్నట్లుగానే ఈ సినిమాలో ఇచ్చిన సందేశం కుటుంబ ప్రేక్షకులకు బాగా చేరువైంది. ఈ సినిమాకి పెద్ద రన్‌ ఉంటుందని ఆశిస్తున్నాం’ అని తెలిపారు. ‘అందరూ ఈ సినిమా గురించి ఇంత గొప్పగా మాట్లాడటం, ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడం సంతోషంగా ఉంది’ అని దర్శకుడు సముద్రఖని చెప్పారు. సంగీత దర్శకుడు తమన్‌ మాట్లాడుతూ, ‘వకీల్‌ సాబ్‌, భీమ్లా నాయక్‌, బ్రో, ఓజీ ఇలా వరుసగా పవన్‌ కళ్యాణ్‌ సినిమాలకు పని చేయటం ఆనందంగా ఉంది. నా సంగీతంలో ఇంత పరిణితి కనబడటానికి కారణం త్రివిక్రమ్‌.ఈ సినిమాని అందరూ బాగా ఆదరిస్తున్నారు’ అని అన్నారు.

Spread the love